Wednesday 17 August 2011

land rights struggle

మిత్రులారా ,
రాష్ట్ర యానాది సమాఖ్య అధ్వర్యంలో జరుగు తున్న భూ పోరాటంలో భాగంగా వాకాడు మండలంలోని దుగరాజ పట్నం రెవిన్యూ గ్రామంలో స.no.888,889,890,891,892,893,894,895,896-901,లలో అన్యాక్రాంతమైన,ఖాలిగా వున్న 337 ఎకరముల ప్రభుత్వ భూములను ఆ గ్రామంలోని భూమి లేని నిరుపేద యానాదులు దళితులూ ఇటీవల మూకుమ్మడిగా ఆక్రమించు కోవడం జరిగింది.ఈ భూమిలో పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకొన్నారు.అదేవిధముగా పంబలి గ్రామములో యానాదుల పేర్లమీద మంజూరు చేసి రికార్డ్స్ లో వుంది,వేరే వారి అనుభవంలో వున్న 216 ఎకరముల భూమి గురించి,యానాది సమాఖ్య కృషి ఫలితముగ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ భూముల గురించి విచారించి 6 వ విడత భు పంపినిలో పంపిణి చేయమని ఆదేశాలు జారి చేసారు .దీంతో వాకాడు మండల రెవిన్యూ అధికారులు విచారణ మొదలు పెట్టి దుగరాజ పట్నంలోని భుములు కోలిచి హద్దులు వేసారు ౬ వ విడత భు పంపినిలో 192 మందికి వాక్కో ఎకారము చొప్పున పంపిణి చేసేందుకు చర్యలు మొదలు పెట్టారు.పంబలి లోని యానాదుల భూమి ఆక్రమించుకొన్న వారి వద్దనుండి భూములు విడిపించి భూమిలేని యానాదులకు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.ఈ విషయమై చొరవతీసుకొని సహాయం చేస్తున జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సౌరబ్ గౌర్ గారికి ARD సంస్థ సిబ్బందికి యానాది సమాఖ్య , పేద ప్రజలు కృతఙ్ఞతలు తెలియ చేసు కొంటున్నారు.కోట వాకాడు,చిత్తమూరు మూడు మండలాల్లో గత ఐదు విడతల భూ పంపిణి కార్యక్రమంలో ప్రభుత్వం యానాదులకు 316 కుటుంబాలకు 260 ఎకరాలు మాత్రమె పంపిణి చేసారు.ఈ సారి వక్క 6 వ విడత భు పంపినిలో ARD సంస్థ పనిచేస్తున్న గ్రామాలలో కనీసం 2,౦౦౦ ఎకరముల భూమి యానాదుల కు వచ్చేటట్లు యానాది సమాఖ్య ARD సంస్థ కృషి చేస్తున్నవి మీ యొక్క సంఘీభావాన్ని కోరు కొంటూ..........
1.JPG

No comments:

Post a Comment